బాలుడు మృతి | boy died | Sakshi
Sakshi News home page

బాలుడు మృతి

Nov 8 2016 12:40 AM | Updated on Jul 12 2019 3:02 PM

దర్శి : ఓ బాలుడు విషజ్వరంతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక పంచాయతీ పరిధి కొత్తరెడ్డిపాలెంలో సోమవారం వెలుగు చూసింది.

 
 
దర్శి : ఓ బాలుడు విషజ్వరంతో బాధపడుతూ పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ సంఘటన స్థానిక పంచాయతీ పరిధి కొత్తరెడ్డిపాలెంలో సోమవారం వెలుగు చూసింది. మృతుడి తండ్రి బాబూరావు కథనం ప్రకారం.. గుత్తికంటి జశ్వంత్‌(5)కు తీవ్ర జ్వరం వచ్చింది. తల్లిదండ్రులు గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి వైద్యులు వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి జశ్వంత్‌కు వైరల్‌ ఫీవర్‌తో పాటు డెంగీ లక్షణాలు కూడా ఉన్నాయని నిర్ధారించారు. అప్పటికే బాలుడి వైద్యానికి లక్ష రూపాయలకు పైగా ఖర్చు చేశారు. అయినా ఫలితం ఆదివారం సాయంత్రం 6 గంటల సమయంలో బాలుడు ఆస్పత్రిలోనే మృతి చెందాడు. రాత్రికి కొత్తరెడ్డిపాలెం గ్రామానికి బాలుడి మృతదేహాన్ని తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసిన బంధువులు కన్నీరుమున్నీరై విలపించారు. ఇటీవల గ్రామానికి చెందిన ఓ యువకుడు డెంగీ అనుమానిత లక్షణాలతో మృతి చెందాడు. మళ్లీ బాలుడు తీవ్ర జ్వరంతో మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement