యువతి ఆత్మహత్య

Young woman committed suicide  - Sakshi

పటాన్‌చెరు టౌన్‌ : ఉద్యోగం రాదేమోనన్న బెంగతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ ప్రవీణ్‌ కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. పటాన్‌చెరు శ్రీనగర్‌ కాలనీకి చెందిన మారుతి రావు ఆర్‌ఎంపీ డాక్టర్‌. ఇతనికి ఇద్దరు కూతుళ్లు. చిన్న కూతురు సంధ్యారాణి(23) బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో సివిల్స్‌ కోచింగ్‌ తీసుకుంటుంది. దీంతో ఉద్యోగం సాధించలేనన్న బెంగతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top