రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి

ఖమ్మం : ఖమ్మం రూరల్ మండలం నాయుడుపేట బైపాస్ వద్ద ప్రమాదం జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు ఏడులపురం గ్రామానికి చెందిన మేడా వీరాస్వామి(25), వరప్రసాద్(30)లుగా గుర్తించారు. బైక్‌పై ఖమ్మం నుంచి స్వగ్రామం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలిసి పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top