హైవేపై ప్రమాదం | Road Accident In Kurnool Three Injured | Sakshi
Sakshi News home page

హైవేపై ప్రమాదం

Apr 3 2018 11:45 AM | Updated on Aug 30 2018 4:20 PM

Road Accident In Kurnool Three Injured - Sakshi

బోల్తాపడిన క్రూజర్‌ వాహనం (ఇన్‌సెట్‌) గాయపడిన ప్రయాణికులు

కర్నూలు హాస్పిటల్‌:  కర్నూలు నగర శివారులోని రాగమయూరి వద్ద బెంగళూరు– హైదరాబాద్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌–44)పై సోమవారం అర్ధరాత్రి 12.05 గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. 11 మందికి గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. కర్ణాటకలోని యాదగిరి జిల్లా షాపూర్‌కు చెందిన వారు కేఏ32ఎన్‌ 3869 నంబరు గల క్రూజర్‌ వాహనంలో తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వారు వెళ్తున్న వాహనాన్ని రాగమయూరి వద్ద ఏపీ02వీ 6831 నంబరు గల లారీ ఓవర్‌టేక్‌ చేయబోయింది. ఈ క్రమంలో క్రూజర్‌ వాహనాన్ని ముందు భాగంలో ఢీకొట్టింది. దీంతో క్రూజర్‌ బోల్తా పడింది. అందులోని ప్రయాణికుల్లో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఆరుగురు పిల్లలు ఉన్నారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వీరిని వెంటనే కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement