భార్యపై అనుమానంతో.. | Man Murdered His Wife In YSR District | Sakshi
Sakshi News home page

భార్యపై అనుమానంతో..

Dec 21 2018 7:04 PM | Updated on Dec 21 2018 7:53 PM

Man Murdered His Wife In YSR District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

చిన్నమండ్యం: వైఎస్సార్‌ జిల్లా చిన్నమండ్యం మండలం చాకిబండలో దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆంజనేయులు అనే వ్యక్తి కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని కిరాతకంగా కొడవలితో దాడిచేశాడు. అడ్డొచ్చిన అత్తను సైతం కొడవలితో నరికాడు. ఈ ఘటనలో భార్య గంగా దేవి అక్కడికక్కడే మృతిచెందగా..గంగాదేవి తల్లి మల్లమ్మ పరిస్థితి విషమంగా ఉంది. మెరుగైన చికిత్స నిమిత్తం మల్లమ్మను తిరుపతికి తరలించారు.

ఘటన అనంతరం నిందితుడు ఆంజనేయులు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తల్లి మృతిచెందడం, తండ్రి జైలుపాలు కావడంతో కూతరు తేజేశ్వరీ, కుమారుడు శ్రీనాథ్‌లు అనాధలయ్యారు. ఆంజనేయులు గల్ఫ్‌ నుంచి ఇటీవలే స్వగ్రామానికి వచ్చినట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement