రాజీనామా అంటూ నాటకాలా ? | YSR Congress party leader Roja takes on CM Kiran kumar reddy, Chandrababu naidu | Sakshi
Sakshi News home page

రాజీనామా అంటూ నాటకాలా ?

Feb 13 2014 11:59 AM | Updated on Jul 29 2019 5:31 PM

రాజీనామా అంటూ నాటకాలా ? - Sakshi

రాజీనామా అంటూ నాటకాలా ?

రాష్ట్ర విభజనకు సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు సహకరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఆరోపించారు.

రాష్ట్ర విభజనకు సీఎం కిరణ్, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడులు సహకరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా ఆరోపించారు. గురువారం చిత్తూరులో రోజా మాట్లాడారు. రాష్ట్ర విభజనపై వారిద్దరు అవలంభించిన వైఖరిపై రోజా ఈ సందర్భంగా దుమ్మెత్తిపోశారు. తాను తెలంగాణకు అనుకూలం అంటూ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ ఇచ్చి సహకరించారని గుర్తు చేశారు.

 

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసినప్పుడు నోరు మెదపని సీఎం ఇప్పుడు రాజీనామా అంటూ నాటకాలాడుతున్నారని ఎద్దేవా చేశారు. అంధ్రప్రదేశ్ను సమైక్యంగా ఉంచేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అకుంఠిత దీక్షతో పోరాటం చేస్తున్న ఏకైక వ్యక్తిగా రోజా అభివర్ణించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement