ఢిల్లీ: ఎంపీ లగడపాటి రాజగోపాల్కు ఇద్దరు భార్యలున్నారని దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రెండో పెళ్లికి సంబంధించి పిటిషనర్ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది.
లగడపాటి రాజగోపాల్ మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర కూతురు పద్మను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కూమారులు. అయితే 2004లో తనకు ఇద్దరు కుమారులు మాత్రమేనని ఎన్నికల అఫిడవిట్లో ఆయన తెలియజేశారు. 2009లో సమర్పించిన అఫిడవిట్లో మాత్రం తనకు ముగ్గురు కూమారులని చెప్పారు. మూడో కుమారుడి పేరు ఎల్.హర్మన్ అని పేర్కొన్నారు. దాంతో ఆయన రెండో పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
లగడపాటి రాజగోపాల్కు రెండవ పెళ్ళి జరిగిందని, వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడని కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన న్యాయవాది సుంకర కృష్ణమూర్తి గతంలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సిఇఒ)కి ఫిర్యాదు చేశారు. ఎన్నికలలో రిటర్నింగ్ అధికారి వద్ద దాఖలు చేసిన అఫిడవిట్లో నాలుగవ డిపెండెంట్గా మూడవ కుమారుడు హర్మన్ పేరును ప్రస్తావించారు. లగడపాటి జానకి అనే మహిళను రెండవవివాహం చేసుకున్నారని, వారిద్దరికీ జన్మించిన పుత్రుడే హర్మన్ అని కృష్ణమూర్తి పేర్కొన్నారు. లగడపాటి, జానకి దండలు వేసుకున్న ఫోటోను కూడా ఆయన జతపరిచారు. వారిద్దరికీ జన్మించిన హర్మన్ జనన నిర్థారణ పత్రాన్ని కూడా ఆయన జతపరిచారు.
లగడపాటి ఇద్దరు భార్యల విషయమై ఆయన రాజకీయ ప్రత్యర్ధులు కూడా ఒక సందర్భంలో విమర్శలు గుప్పించారు. ఈ నేపధ్యంలో లగడపాటి రెండవ పెళ్లి చేసుకున్నట్లు కోర్టులో పిటిషన్ దాఖలైంది. అయితే లగడపాటి రెండవ పెళ్లి చేసుకున్నట్లు పిటిషనర్ ఆధారాలు చూపలేదని కోర్టు కొట్టివేసింది.
ఎంపీ లగడపాటి ఇద్దరి భార్యల పిటిషన్ కొట్టివేత
Published Thu, Sep 19 2013 6:39 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్..!
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
కౌంటింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు
తప్పక చదవండి
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- షర్మిల.. ఎందుకిలా..!
- నరేష్ గోయెల్కు బెయిల్ మంజూరు.. ఏం జరిగిందంటే..
- Modi-CBN: దొందూ దొందే!
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement