సీమాంధ్రులకు అన్యాయం జరిగిందని హడావుడి చేస్తున్న చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మరని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు.
రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు సీమాంధ్రులకు అన్యాయం జరిగిందని హడావుడి చేస్తున్న చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మరని వైఎస్సార్ సీపీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లు రాక్షసపాలన సాగించిన బాబును రాష్ట్ర ప్రజలు అంత సులభంగా మరిచిపోరని పేర్కొన్నారు. నెల్లూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత హోదాలో లేఖ ఇచ్చి రాష్ట్రం ముక్కలు కావడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు.