బాబును ప్రజలు నమ్మరు: మేకపాటి | State people don't believe chandrababu speech, says Mekapati Rajamohan reddy | Sakshi
Sakshi News home page

బాబును ప్రజలు నమ్మరు: మేకపాటి

Sep 5 2013 12:15 PM | Updated on Jul 28 2018 3:21 PM

సీమాంధ్రులకు అన్యాయం జరిగిందని హడావుడి చేస్తున్న చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మరని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు సీమాంధ్రులకు అన్యాయం జరిగిందని హడావుడి చేస్తున్న చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మరని వైఎస్సార్ సీపీ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. తొమ్మిదేళ్లు రాక్షసపాలన సాగించిన బాబును రాష్ట్ర ప్రజలు అంత సులభంగా మరిచిపోరని పేర్కొన్నారు. నెల్లూరులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత హోదాలో లేఖ ఇచ్చి రాష్ట్రం ముక్కలు కావడానికి కారణమైన చంద్రబాబు ఇప్పుడు మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement