విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉడ్పేటలో ఉన్న స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు.
అనకాపల్లిలో ఏటీఎం చోరీకి విఫలయత్నం
Jan 19 2016 9:39 AM | Updated on Aug 30 2018 5:27 PM
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలోని ఉడ్పేటలో ఉన్న స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో చోరీకి దొంగలు విఫలయత్నం చేశారు. ఈ సంఘటన మంగళవారం వేకువజామున జరిగింది. ఏటీఎంను ధ్వంసం చేసి డబ్బు తీసుకునేందుకు యత్నించారు. వారి ప్రయత్నం విఫలం కావడంతో పరారయ్యారు. ఉదయం గమనించిన బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏటీఎంలోని డబ్బు అలాగే ఉంది.
Advertisement
Advertisement