వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేట మండలం రామాపురంలో మంగళవారం తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు భారీగా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేట మండలం రామాపురంలో మంగళవారం తెల్లవారుజామున అటవీశాఖ అధికారులు భారీగా ఎర్రచందన దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఇద్దరు స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం స్మగ్లర్లను పోలీసులకు అప్పగించారు.
పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అలాగే ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించి సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ బహిరంగ మార్కెట్లో రూ.15 లక్షల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు వెల్లడించారు.