ఆంధ్రప్రదేశ్ పే అండ్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న సన్నాల రంగారావు సోమవారం హఠాత్తుగా మరణించారు.
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పే అండ్ అకౌంట్స్ అధికారిగా పనిచేస్తున్న సన్నాల రంగారావు సోమవారం హఠాత్తుగా మరణించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2013 జూలై 1 నుంచి పే అండ్ అకౌంట్స్ అధికారిగా రంగారావు విధులు నిర్వహిస్తున్నారు.
ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ కల్లాం, ఇతర ఆర్థిక శాఖ అధికారులు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసు సిబ్బంది వెస్ట్ మారేడుపల్లిలోని ఆయన నివాసానికి వెళ్లి భౌతిక కాయానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. బన్సీలాల్పేట శ్మశానవాటికలో రంగారావు అంత్యక్రియలు నిర్వహించారు.