
మేకపాటి వ్యాఖ్యలతో ఏకీభవించిన వెంకయ్య
పర్వతారోహణతో దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్బాబుకు నేషనల్ గ్యాలెంటరీ అవార్డు ఇవ్వాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు.
ఢిల్లీ: పర్వతారోహణతో దేశకీర్తిని విశ్వవ్యాప్తం చేసిన మల్లి మస్తాన్బాబుకు నేషనల్ గ్యాలెంటరీ అవార్డు ఇవ్వాలని వైఎస్సార్సీపీ లోక్సభాపక్ష నేత మేకపాటి రాజమోహన్రెడ్డి అన్నారు. మస్తాన్ బాబు కుటుంబానికి కేంద్రం సాయం చేయాలని లోక్ సభలో కేంద్రాన్ని కోరారు. పేద గిరిజన కుటుంబంలో జన్మంచిన మస్తాన్ బాబు ఎంతో శ్రమించి ఉన్నత స్థితికి చేరాడని తెలిపారు.
మేకపాటి వ్యాఖ్యలకు వెంటనే కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. మల్లి మస్తాన్ బాబుకు అవార్డు, సాయం కేంద్ర పరిశీలనలో ఉందని లోక్ సభలో బదులిచ్చారు.