ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం క్రమంగా ముదురుతోంది.
ఏపీ విద్యుత్ సంస్థలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య విద్యుత్ వివాదం క్రమంగా ముదురుతోంది. తెలంగాణ విద్యుత్ సంస్థలు ఇవ్వాల్సిన బకాయిలను రాబట్టేందుకు ఏపీ ఇంకాస్త దూకుడు పెంచబోతోంది. చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఏపీ విద్యుత్ ఉన్నతాధికారులను ఆదేశించారు.
తాజా పరిస్థితిని వివరిస్తూ కేంద్ర ఇంధన శాఖకు లేఖ రాయాలని సూచించారు. తెలంగాణకు చివరి అవకాశం ఇద్దామని, అప్పటికీ దారికి రాకపోతే తదుపరి కార్యాచరణ రూపొందిద్దామని ముఖ్యమంత్రి చెప్పినట్లు తెలిసింది.