వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టి కృషి | Collective efforts to strengthen YSR CP | Sakshi
Sakshi News home page

వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టి కృషి

May 17 2016 3:08 AM | Updated on Aug 20 2018 9:26 PM

వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టి కృషి - Sakshi

వైఎస్సార్ సీపీ బలోపేతానికి సమష్టి కృషి

వైఎస్సార్ సీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు.

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి

ఆత్మకూరు: వైఎస్సార్ సీపీ బలోపేతానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి పిలుపునిచ్చారు. కర్నూల్‌లో సోమవారం వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు నిర్వహించనున్న జలదీక్షకు నియోజకవర్గం నుంచి ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వారినుద్దేశించి ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ మండుటెండలను సైతం లెక్కచేయకుండా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావడం అభినందనీయమన్నారు.

పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమానికి  నేతలు, కార్యకర్తలు మద్దతు పలకడం హర్షనీయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ప్రజావ్యతిరేక కార్యక్రమాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన జలాలను దక్కకుండా చేయడంలో చేస్తున్న కుట్రను వైఎస్ జగన్ ప్రజలకు విశదీకరించేందుకు జలదీక్ష నిర్వహిస్తున్నారన్నారు.  కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శులు దేవరపల్లి శ్రీనివాసులరెడ్డి, అంబటి కృష్ణారెడ్డి, చేజర్ల, ఏఎస్‌పేట మండల నేతలు కొమ్మి సిద్ధులునాయుడు, పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, జయంతులునాయుడు, ఆత్మకూరు యువత అధ్యక్షులు నాగులపాటి ప్రతాప్‌రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు శేషం హజరత్‌బాబు, కుప్పురుపాడు సర్పంచ్ శ్రీనివాసులునాయుడు, మందా రామచంద్రారెడ్డి, రామానాయుడు, వైఎస్సార్ సీపీ నేతలు గడ్డం శ్రీనివాసులరెడ్డి, రవీంద్రబాబు, హజరత్‌రెడ్డి, సోమా మాధవరెడ్డి, ఖాదర్‌బాష, కొండ్రెడ్డి రమణారెడ్డి, బండారు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement