విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం రావణాపల్లిలో 150 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు.
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలం రావణాపల్లిలో 150 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అందుకు సంబంధించి ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్కి తరలించారు. అలాగే కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. వారిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.