ఈనాటి ముఖ్యాంశాలు | Today Telugu News Nov 8th Fadnavis resigns as Maharashtra CM | Sakshi
Sakshi News home page

ఈనాటి ముఖ్యాంశాలు

Nov 8 2019 7:54 PM | Updated on Nov 8 2019 8:04 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కేంద్ర ఉక్కు, ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమావేశమయ్యారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రవాసాంధ్రుల నుంచి వచ్చే సహాయం కొరకు ఏర్పాటు చేసిన ‘కనెక్ట్‌ టూ ఆంధ్రా’ వెబ్‌ పోర్టల్‌ను ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమి చైర్మన్‌గా శ్రీనాథ్ దేవిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. సోమవారం వరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్న లేఖను దేవేంద్ర ఫడణవీస్ గవర్నర్‌కు ఫడణవీస్ అందించారు.  

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement