శ్రీదేవి మృతిపై సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

శ్రీదేవి మృతిపై సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు

Published Tue, Feb 27 2018 11:22 AM

ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మరణం,  దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో బీజేపీ సీనియర్‌నేత, ప్రముఖ న్యాయవాది కూడా అయిన సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవికి మద్యం సేవించే అలవాటు లేదంటూ ..ఫోరెన్సిక్‌ రిపోర్టులో వెల్లడైన అంశాలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. డాక్టర్లు  అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి గుండెపోటుతో చనిపోయారని ప్రకటించారని.. ఈ నేపథ్యంలో ఆమెతో బలంగా మద్యం సేవించారా అనేది తేలాలంటూ పెను సంచలనానికి తెర తీసారు.