కాంగ్రెస్‌ సిగ్గు వదిలేసింది:మోదీ | Salman Nizami Questioned My Parentage: PM Modi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ సిగ్గు వదిలేసింది:మోదీ

Dec 9 2017 4:25 PM | Updated on Mar 21 2024 8:47 PM

ఓ పక్క తొలిదశ పోలింగ్‌ జరుగుతుండగానే రెండో దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ మునిగిపోయారు. తనను నీచమైన వ్యక్తి అంటూ కాంగ్రెస్‌ పార్టీ నేత మణిశంకర్‌ చేసిన వ్యాఖ్యలను పదే పదే ప్రజలకు గుర్తు చేస్తూ ప్రచార అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి కీలక అనుచరుడైన సల్మాన్‌ నిజామీ చేసిన వ్యాఖ్యలను మరో ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తున్నారు. సల్మాన్‌ తన తల్లిదండ్రులు ఎవరని ప్రశ్నిస్తున్నారని, అసలు అలాంటి భాష ఉపయోగించవచ్చా అని మోదీ ప్రశ్నించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement