ప్రయాణికుల భద్రతలో రవాణా సంస్థ నంబర్‌ వన్‌ | Sakshi
Sakshi News home page

ప్రయాణికుల భద్రతలో రవాణా సంస్థ నంబర్‌ వన్‌

Published Tue, Dec 10 2019 12:45 PM

అంతకు ముందు తిరుమల ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ భద్రతపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సభలో మాట్లాడారు. 15 ఏళ్లు దాటిన బస్సులేవి ఆర్టీసీలో లేవని తెలిపారు. ప్రయాణికుల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ నంబర్‌ వన్‌గా ఉందన్నారు. చిత్తూరు జిల్లాలో 1278 బస్సులు ఫిట్‌నెస్‌గా ఉన్నాయని చెప్పారు. తిరుమల బస్సులన్నీ నాణ్యత ప్రమాణాల మేరకే ఉన్నాయని స్పష్టం చేశారు. ఏప్రిల్‌ నాటికి 1000 కొత్త కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు. అలాగే 350 ఎలక్ట్రిక్‌ బస్సులకు టెండర్లు పిలుస్తామని తెలిపారు.