విద్యుత్‌ కొనుగోళ్లతో రూ.5 వేల కోట్ల భారం | Minister Srinivas Reddy Letter To Central Electricity Minister RK Singh | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కొనుగోళ్లతో రూ.5 వేల కోట్ల భారం

Oct 12 2019 9:34 PM | Updated on Mar 21 2024 8:31 PM

సోలార్‌, విండ్‌ పవర్‌ల కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.ఐదు వేల కోట్ల భారం పడుతుందని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌కి రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి  లేఖ రాశారు. సోలార్‌,విండ్‌ పవర్‌ల కోసం యూనిట్‌కు రూ.3.55 భారం పడుతోందని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. సోలార్‌, విద్యుత్‌ పవర్‌ల కొనుగోలు కారణంగా రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతుందన్నారు. ఇప్పటికే విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఏపీలో మరింత సంక్షోభం తలెత్తుతోందని పేర్కొన్నారు. ఏపీకి సంబంధించిన విద్యుత్‌ సరఫరా కంపెనీలు దేశంలోనే అత్యంత తక్కువ విద్యుత్ సరఫరా నష్టాలు నమోదు చేస్తూ మంచి పనితీరు కనబరుస్తున్నా, పై కారణాల వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటున్నాయని లేఖలో ప్రస్తావించారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement