చెన్నైలో అళగిరి శాంతి ర్యాలీ

డీఎంకే మాజీ అధినేత కరుణానిధి మరణంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. పార్టీపై పట్టుకు ఒక్కరికొకరు పోటీ పొడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్‌ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరుణానిధి మరో కుమారుడు అళగిరి పార్టీపై తిరుగబాటు జెండా ఎగరవేశారు. స్టాలిన్‌ తమ నాయకుడు కాదని.. అసలైన డీఎంకే కార్యకర్తలు తన వెంటే ఉన్నారని ఇటీవల పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విధితమే. దీంతో స్టాలిన్‌ వర్గానికి హెచ్చరికగా నేడు చెన్నైలో అళగిరి తన మద్దతు దారులతో శాంతి ర్యాలీని నిర్వహించనున్నారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top