ఓటమిని పట్టించుకోని కోమటిరెడ్డి

మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అనూహ్య పరాజయంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్‌ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. నల్గొండ నియోజకవర్గం నుంచి గతంలో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించిన కోమటిరెడ్డి ఈ సారి ఓటమి చవిచూశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన వెంకట్‌ రెడ్డి.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తానే సీఎం అవుతానని కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే నల్గొండ ప్రజలు మాత్రం ఈ సారి వెంకట్‌ రెడ్డికి అవకాశం ఇవ్వకుండా మార్పును కోరుకున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాలరెడ్డి 23,698 ఓట్ల మెజార్టీతో గెలిపించారు.

Read latest News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top