నా పాదయాత్రలో రైతుల కష్టాలను చూశా
‘అభివృద్ది అంటే జీడీపీ లెక్కలు మాత్రమే కాదు.. రైతు కుటుంబం బాగుండడాన్నే అభివృద్దిగా భావిస్తాను. రైతు ఆనందంగా ఉంటేనే రాష్ట్రం అభివృద్దిలో ప్రయాణిస్తున్నట్టు నేను నమ్ముతాను. రైతుకు భరోసా ఉంటేనే.. రాష్ట్రానికి కూడా భరోసా ఉంటుంది. నిన్నటి కన్నా ఈ రోజు మన పరిస్థితి మెరుగ్గా ఉంటేనే అభివృద్ది చెందినట్లు’అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్’పథకాన్ని మంగళవారం నెల్లూరు సింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు.
మరిన్ని వీడియోలు
సినిమా
వార్తలు
సీఎం వైఎస్ జగన్
బిజినెస్
క్రీడలు
వైరల్ వీడియోలు