ఐపీఓపై అంతర్గతంగా రిలయన్స్‌ చర్చలు.. | Sakshi
Sakshi News home page

ఐపీఓపై అంతర్గతంగా రిలయన్స్‌ చర్చలు..

Published Wed, Dec 13 2017 7:08 AM

దేశీ టెలికం పరిశ్రమను ‘జియో’తో షేక్‌ చేసిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ... స్టాక్‌ మార్కెట్లో కూడా ఇదే విధమైన ప్రకంపనలు సృష్టించేందుకు రెడీ అవుతున్నారు. ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ జియో పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ)కు సన్నాహాలు మొదలుపెట్టినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అంతర్గతంగా దీనిపై చర్చలు కూడా జరుపుతున్నట్లు ‘బ్లూంబర్గ్‌’ వార్త సంస్థ నివేదిక పేర్కొంది.