చివరి రోజు ఆటలో ఊహించిందే జరిగింది. భారత బౌలర్ల ఎదురుదాడిని ఇంగ్లండ్ ఏమాత్రం నిలువరించలేకపోయింది. తొలి సెషన్లోనే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్.. ఇక రెండో సెషన్ ఆరంభమైన కాసేపటికే చేతులెత్తేసింది. నాల్గో రోజు ఆటలో రెండు వికెట్లను ఇంగ్లండ్ కూల్చి ఫర్వాలేదనిపించిన భారత్.. ఐదో రోజు ఆటలో మాత్రం చెలరేగిపోయింది. అసలు ఇంగ్లండ్ ఆటగాళ్లను క్రీజ్లో కుదురుకోనీయకుండా చేసి మ్యాచ్ను సొంతం చేసుకుంది. భారత విసిరిన 405 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ తన రెండో ఇన్నింగ్స్ లో 97.3 ఓవర్లలో 158 పరుగులకే చాపచుట్టేసి ఘోర పరాభవం మూటగట్టుకుంది. తద్వారా భారత్ ఖాతాలో 246 పరుగుల సూపర్ విక్టరీ చేరింది.
Nov 21 2016 12:48 PM | Updated on Mar 21 2024 8:11 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement