తిరుమలలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. అక్టోబరు 3వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాలు నేపథ్యంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రధానంగా శ్రీవారి ఆలయం చుట్టూ నాలుగు మాడ వీధుల్లో వాహన సేవలు తిలకించేలా భక్తులకోసం గ్యాలరీలు, బ్యారికేడ్లు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే తూర్పుమాడ వీధిలో దాదాపుగా ఈ పనులు పూర్తి చేశారు. దక్షిణ, పడమర,ఉత్తరమాడ వీధుల్లో కొనసాగుతున్నాయి. ఆలయంతోపాటు కూడళ్లలో భారీ కటౌట్లు ఏర్పాటు చసేందుకు విద్యుత్ అలంకరణ పనులు సాగుతున్నాయి. ఇక ఆలయ నాలుగు మాడ వీధులు రంగుల రంగవళ్లులతో శోభాయమానంగా కనిపిస్తున్నాయి. ఆలయానికి ఇప్పటికే తెల్లసున్నం అలంకరణ చేశారు.
Sep 12 2016 9:36 AM | Updated on Mar 21 2024 9:52 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement