రాజన్నకు ఏటా రూ.100 కోట్లు | rs-100-crore-for-srirajarajswera-swamy-temple-every-year | Sakshi
Sakshi News home page

Jun 19 2015 7:42 AM | Updated on Mar 21 2024 7:54 PM

దక్షిణకాశీగా ప్రఖ్యాతి పొందిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని.. ఇందుకోసం ఏటా రూ.100 కోట్ల చొప్పున నాలుగైదేళ్లపాటు కేటాయిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పారు. అందులో భాగంగా తక్షణమే రూ.100 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. రాజరాజేశ్వరస్వామి దేవస్థానం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధికార సంస్థ (అథారిటీ)ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. తన వివాహం వేములవాడలోనే జరిగిందని.. తెలంగాణ ఉద్యమ సమయంలో రాజన్నను దర్శించుకుని వెళ్లి ఆమరణ దీక్షను ప్రారంభించానని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం 1.30 గంటలకు కుటుంబ సమేతంగా వేములవాడ చేరుకున్నారు. తొలుత రాజన్న దేవాలయంలో తన సతీమణితోపాటు కుమార్తె కవిత దంపతులతో కలసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలను, గుడి చెరువును పరిశీలించారు. వేములవాడ శివార్లలోని నాంపల్లి గుట్టను సందర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement