బీజేపీ పార్లమెంటరీ పార్టీ నేతగా నరేంద్ర మోడీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోడీ పేరును బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ ప్రతిపాదించారు. బీజేపీ మాజీ అధ్యక్షులు మురళీ మనోహర్ జోషి, ఎం. వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీలు అద్వానీ ప్రతిపాదనను సమర్థించారు. సీనియర్ నేతలు కరియా ముండా, రవిశంకర్ ప్రసాద్, గోపీనాథ్ ముండే, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా అద్వానీ ప్రతిపాదనకు మద్దతు పలికారు. మోడీని పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నట్టు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్ ప్రకటించారు. పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపికైన నరేంద్ర మోడీని బీజేపీ నేతలు అభినందలతో ముంచెత్తారు.
May 20 2014 12:31 PM | Updated on Mar 21 2024 10:59 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement