టీడీపీ ఆరిపోయే దీపమని, అక్రమ కేసులకు భ యపడేది లేదని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా స్పష్టం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు. పట్టణ పరిధిలోని సీవీఆ ర్ కళ్యాణ మండపంలో ఆదివారం ఆర్కే రోజా అధ్యక్షతన నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత సమావేశం జరిగింది. ముఖ్యఅతిథులుగా ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణకరరెడ్డి, జిల్లా కన్వీనర్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి, పూతలపట్టు ఎమ్మెల్యే సు నీల్కుమార్, సత్యవేడు నియోజకవర్గ ఇన్చార్జీ ఆది మూలం, రాష్ట్ర సంయుక్త కమిటీ సభ్యుడు పోకల ఆశోక్కుమార్ హాజరయ్యారు
Jul 18 2016 9:48 AM | Updated on Mar 22 2024 11:06 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement