రాజధాని నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని నిక్కచ్చిగా చెబుతూనే...దీని పేరిట ఏ ఒక్క రైతుకు కానీ, కౌలు రైతుకు కానీ, కూలీకి కానీ అన్యాయం జరిగితే సహించేది లేదని స్పష్టం చేస్తోంది. ప్రతిపక్షంగా తన బాధ్యతను నిర్వర్తిస్తోంది. రాజధాని గ్రామాల్లో జరుగుతున్న అక్రమాలు, ముఖ్యంగా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతిపక్ష నాయకుని హోదాలో జగన్ అసెంబ్లీ సమావేశాలు జరిగిన ప్రతిసారి సభ దృష్టికి తెస్తూనే ఉన్నారు. భూ సమీకరణతో తృప్తి చెందకుండా, భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో జగన్మోహన్రెడ్డి మరోసారి రైతు పక్షాన పోరాటానికి సిద్ధమయ్యారు.