'తెలంగాణా ఏర్పాటును ఎప్పుడూ వ్యతిరేకించలేదు' | i would never against telangana says chandra babu naidu | Sakshi
Sakshi News home page

Feb 21 2014 7:54 PM | Updated on Mar 20 2024 2:09 PM

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లు ఉభయ సభల్లోనూ ఆమోదం పొందిన సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. తెలంగాణకు తాము గతంలో లేఖ ఇచ్చిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ఆ లేఖకు కట్టుబడే విభజనకు సహకరించామన్నారు. విభజన చేసేటప్పుడు ఇరుప్రాంతాలకు ఆమోదయోగ్యంగా జరగాలని కూడా ఆ లేఖలో తెలిపానని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విభజించిన తీరునే తాను ప్రశ్నిస్తున్నానన్నారు. సీమాంధ్రకు ఏర్పాటు చేసే కొత్త రాజధానికి రూ.నాలుగు లక్షల కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నట్లు బాబు తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement