రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. సివిల్, ఏఆర్, బెటాలియన్స్, ఎస్పీఎఫ్, ఫైర్మెన్ విభాగాల్లోని 11,281 పోస్టులకుగాను 10,113 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పూర్ణచందర్రావు తెలిపారు. ఇక వారం రోజుల క్రితం పోలీస్ కమ్యూనికేషన్ విభాగం లోని 332 పోస్టులకు జరిగిన నియామక ప్రక్రియలో 329 మంది ఎంపికయ్యారు. దాంతో మొత్తం 11,613 పోస్టులకుగాను.. 10,442 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపికైనట్టు వెల్లడించారు. కటాఫ్ మార్కులు, కేటగిరీల వారి ఎంపిక వివరాలను అధికారిక వెబ్సైట్ www. tslprb.inలో తెలుసుకో వచ్చని పేర్కొన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఈ నెల 20న వెబ్సైట్లో అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
Feb 18 2017 7:07 AM | Updated on Mar 22 2024 11:29 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement