ఉత్తర్ప్రదేశ్ కాన్పూర్ జిల్లాలోని శివ్రాజ్పూర్లో ఉన్న ఓ కోల్డ్ స్టోరేజీ భవనం బుధవారం కుప్పకూలింది. బంగాళాదుంప పంటను కోల్డ్ స్టోరేజీ భవనంలో నిల్వ ఉంచడానికి రైతులు వచ్చినపుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. దీంతో చాలా మంది రైతులు శిథిలాల కింద చిక్కుకున్నారు.