వైఎస్ జగన్తో ఏపీ రాజధాని ప్రాంత రైతుల భేటీ | ap-capital-area-farmers-meet-ys-jagan-mohan-reddy | Sakshi
Sakshi News home page

Dec 11 2014 5:24 PM | Updated on Mar 21 2024 9:01 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ రాజధాని ప్రాతిపాదిత గ్రామాల రైతులు కలిశారు. గురువారం ఉదయం రైతులు జగన్ను కలసి తమ సమస్యలను తెలియజేశారు. రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో భూములు సేకరిస్తోంది. ప్రభుత్వం బలవంతంగా తమ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తోందని రైతులు జగన్ దృష్టికి తీసుకువచ్చారు. పొలాలు తీసుకుంటే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని పెనుమాన, ఉండవల్లి గ్రామాల రైతులు చెప్పారు. ఈ విషయంపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చిస్తామని వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

Related Videos By Category

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement