ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు | - | Sakshi
Sakshi News home page

ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు

Dec 1 2025 7:42 AM | Updated on Dec 1 2025 7:42 AM

ఖోఖో

ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు

ముగిసిన ఎస్జీఎఫ్‌ రాష్ట్ర స్థాయి పోటీలు

అగనంపూడి: ఆంధ్రప్రదేశ్‌ 69వ స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌(ఎస్జీఎఫ్‌) రాష్ట్ర స్థాయి అండర్‌–14 ఖోఖో టోర్నమెంట్‌ ఆదివారం విజయవంతంగా ముగిసింది. గత నెల 28 నుంచి మూడు రోజుల పాటు బాలబాలికలకు జరిగిన ఈ పోటీలు హోరాహోరీగా సాగాయి. లంకెలపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో లారస్‌ ఫార్మా కంపెనీ సహకారంతో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన జట్లు తమ సత్తా చాటాయి. బాలుర విభాగం ఫైనల్స్‌లో నువ్వా నేనా అన్నట్లుగా సాగిన పోరులో విశాఖపట్నం జట్టు విజేతగా నిలిచింది. చిత్తూరు జట్టు రెండో స్థానంలో నిలవగా, గుంటూరు జట్టు మూడో స్థానాన్ని దక్కించుకుంది. బాలికల విభాగంలో చిత్తూరు జట్టు అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించి చాంపియన్‌గా నిలిచి కప్‌ గెలుచుకుంది. విశాఖ జట్టు రన్నరప్‌గా నిలవగా, శ్రీకాకుళం జట్టు మూడో స్థానాన్ని కై వసం చేసుకుంది. పోటీల చివరి రోజు సెమీఫైనల్‌ మ్యాచ్‌లు అద్భుతంగా సాగాయి. ముగింపు కార్యక్రమంలో అనకాపల్లి డీఈవో గిడ్డి అప్పారావు నాయుడు మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక పోటీలను ఎటువంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు ప్రదర్శించిన స్ఫూర్తిని కొనియాడారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. జిల్లా ఉప విద్యాశాఖాధికారి పొన్నాడ అప్పారావు, ఎంఈవో దివాకర్‌రావు, పాఠశాల హెచ్‌ఎం రౌతు నాగేశ్వరరావు, కార్పొరేటర్లు రౌతు శ్రీనివాసరావు, బొండా జగన్నాథం, మొల్లి ముత్యాల నాయుడు, గరవ కార్పొరేషన్‌ చైర్మన్‌ మళ్ల సురేంద్ర, ఎస్జీఎఫ్‌ అనకాపల్లి, విశాఖ జిల్లాల కార్యదర్శులు కె.ఎం.నాయుడు, టి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

బాలికల విజేత చిత్తూరు జట్టుకు ట్రోఫీ అందజేస్తున్న నిర్వాహకులు, అతిథులు

బాలుర విభాగం విజేత విశాఖపట్నం జట్టుతో అతిథులు

ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు 1
1/2

ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు

ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు 2
2/2

ఖోఖో విజేతలు విశాఖ, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement