
రెచ్చిపోతున్న కూటమి నేతలు
● ఇష్టారాజ్యంగా ప్రకృతి వనరుల దోపిడీ ● అక్రమంగా క్వార్ట్, ఇసుక, మట్టి.. సిలికా తవ్వకాలు ● పట్టించుకోని అధికారులు ● యథేచ్ఛగా దందా సాగిస్తున్న పచ్చమూక
చిల్లకూరు : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వార్ట్ ్జ, ఇసుక, గ్రావెల్, సిలికా తదితర వనరులను అధికార పార్టీ నేతలు అక్రమంగా తవ్వేస్తున్నారు. నిత్యం వందల టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి పనిలో స్థానిక ప్రజాప్రతినిధి అండగా ఉండడంతో కూటమి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. గూడూరు నియోజకవర్గంలోని అసైన్డ్, డీకేటీ ప్రభుత్వ భూముల్లో ఎక్కడ ఖనిజం ఉంది అని తెలిస్తే అక్కడ గద్దల్లా వాలి పోతున్నారు. రాత్రికి రాత్రి తవ్వకాలు చేపట్టి తరలించేస్తున్నారు. దీనిపై ఏ శాఖ అధికారి కూడా కనీసం పట్టించుకున్న పాపాన పోవడం లేదు. దీంతో తాము ఏం చేసినా అడిగేవారు లేరు.. అనుమతులతో మాకేంటి పని అనే ధీమాతో కూటమి నేతలు రెచ్చిపోతున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలలో దాదాపు ఇదే పరిస్థితి. గూడూరు మండలంలో క్వార్ట్ ్జ, గ్రావెల్ విస్తారంగా లభిస్తోంది. చిల్లకూరు మండలంలో మట్టి, సిలికా, గ్రావెల్ అందుబాటులో ఉంది. కోట, వాకాడు, చిట్టమూరు మండలాలలో ఒక వైపు స్వర్ణముఖి నది ప్రవహిస్తుండడంతో అక్కడ పుష్కలంగా ఇసుక దొరుకుతోంది. కోట, చిట్టమూరు మండలాలలో గ్రావెల్ కూడా లభ్యం అవుతుండడంతో కూటమి నేతల అక్రమార్జనకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.
వరంలా మారిన సాగరమాల
సాగరమాల పేరుతో జాతీయ రహదారులు విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇదే అదునుగా రోడ్డు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్లు ఆయా మార్గాలలోని పేదల భూములను చదును పేరుతో కారు చౌకగా కొనుగోలు చేసేశారు. అందులో 30 అడుగుల మేర తవ్వకాలు చేసి మట్టి, గ్రావెల్ తరలించుకు పోతున్నారు. దీన్ని సాకు చూపిన కూటమి నేతలు సైతం అనధికార లేఅవుట్లకు మట్టి, గ్రావెల్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో గూడూరు, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు మండలాల్లో నిత్యం వందల టిప్పర్లతో వనరుల అక్రమ రవాణా సాగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే సాగరమాల రహదారి కాంట్రాక్టు సంస్థకు చెందిన వాహనాలని చెప్పి తప్పించుకు పోతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి అనుమతులు లేకుండా వనరుల తవ్వకాలు, తరలింపుపై సంబంధిత శాఖల అధికారులను వివరణ కోరేందుకు యత్నించగా ఎవరూ స్పందించకపోవడం గమనార్హం.
గూడూరు మండలంలో
మైకా క్వార్ట్ ్జ అక్రమ తవ్వకం
స్వర్ణముఖిలో ఇసుకను ట్రాక్టర్లలో లోడ్ చేస్తున్న దృశ్యం
కోట మండలంలో ఇసుక తవ్వుతున్న జేసీబీ
ఉచితం లేదు.. నేతలదే పెత్తనం
కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రవేశపెట్టింది.అయితే ఎవరికీ ఉచితంగా ఇసుక దొరకడం లేదు. క్షేత్ర స్థాయిలో రీచ్ల వద్ద కూటమి నేతల పెత్తనం సాగుతోంది. రీచ్లలో ట్రాక్టర్ ఇసుకకు రూ.1,200, టిప్పర్కు రూ.40 వేలు వసూలు చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే ఇసుక లేదని తరిమేస్తున్నారు. ఈ విషయంలో సైతం కూటమి నేతలు అందించే మామూళ్లకు అలవాటు పడిన అధికారులు సాధారణ ప్రజలకు నష్టం చేకూరుస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
గ్రావెల్కు రహదారి
నియోజకవర్గవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గ్రావెల్ ఇబ్బడిముబ్బడిగా దొరుకుతోంది. దీంతో కూటమి నేతల అక్రమార్జన మూడు జేసీబీలు, ఆరు టిప్పర్లు అనే రీతిలో సాగుతోంది. జాతీయ రహదారిపైనా గ్రావెల్, మట్టి లోడ్లతో టిప్పర్లు కనిపిస్తున్నా గనులు, పోలీసు శాఖ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. అధిక లోడ్తో విపరీతమైన వేగంతో వెళ్లే ఈ టిప్పర్లను నిలిపేందుకు సైతం భయపడుతున్నారు.

రెచ్చిపోతున్న కూటమి నేతలు

రెచ్చిపోతున్న కూటమి నేతలు

రెచ్చిపోతున్న కూటమి నేతలు

రెచ్చిపోతున్న కూటమి నేతలు