
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం 12,247 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వారిలో 151 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8.34 లక్షలకు చేరుకుంది. ఒక్కరోజులో కరోనా నుంచి 255 మంది కోలుకోగా, ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8.29 లక్షలకు చేరింది. ప్రస్తుతం 1, 189 క్రియాశీలక కేసులు నమోదయ్యాయి.