
ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్ నుంచి విముక్తి
కొరుక్కుపేట: క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తించి, వైద్యుల సూచనలతో చికిత్సలు తీసుకుంటే దాని నుంచి బయటపడవచ్చని అపోలో క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులు పేర్కొన్నారు. అపోలో క్యాన్సర్ సెంటర్స్ నేతృత్వంలో ‘కాన్విన్’ (క్యాన్సర్ విన్) కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ప్రతి ఒక్కరినీ వారి క్యాన్సర్ ప్రయాణంలో ఒకచోట చేర్చే ఒక సపోర్ట్ గ్రూప్ను తీసుకుని వచ్చేలా శ్రీకారం చుట్టారు. దీని మొదటి చొరవగా క్యాన్సర్ విజేతలతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ గ్రూప్ అంకాలజీ అండ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు దినేష్ మాధవన్ మాట్లాడుతూ క్యాన్సర్కు వ్యతిరేకంగా నేటి పోరాటం అధునాతన చికిత్సలకు మించి పోయిందన్నారు. జాతీయ క్యాన్సర్ సర్వైవర్స్ మాసాన్ని గుర్తించే దిశగా ఒక ముఖ్యమైన అడుగులో, అపోలో క్యాన్సర్ సెంటర్స్ కాన్విన్ అనే క్యాన్సర్ సపోర్ట్ గ్రూప్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు,