
పర్యాటకులకు స్వర్గధామం పుదుచ్చేరి
● పర్యాటక శాఖా మంత్రి లక్ష్మీనారాయణన్
రికార్డు స్థాయిలో సంక్షేమ ఫలాల పంపిణీ
ముదురై రైల్వేస్టేషన్లో గుర్తుతెలియని శిశువు
సాక్షి , చైన్నె: దేశంలోనే అత్యంత ఆదరణ పొందిన పర్యాటక ప్రదేశం కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అని ఆ రాష్ట్ర ప్రజాపనులు, పర్యాటక శాఖ మంత్రి కె.లక్ష్మీనారాయణన్ తెలిపారు. చైన్నె వేదికగా రాడిసన్ రిసార్ట్ పాండిచ్చేరి బే (జీఆర్టీ హోటల్స్ అండ్ రిసార్ట్స్) నేతృత్వంలో పుదుచ్చేరి పర్యాటకాన్ని సెలబ్రేట్ చేసుకునేలా ప్రత్యేక గ్రీన్ ప్రెస్ కాన్ఫరెన్స్ను బుధవారం నిర్వహించారు. జీఆర్టీ హోటల్స్ సీఈఓ విక్రమ్ కోటా అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి పుదుచ్చేరి పర్యాటక శాఖామంత్రి కె.లక్ష్మీనారాయణన్ పాల్గొని గ్రేట్ గ్రీన్ మీటింగ్స్ను ప్రారంభించారు. మంత్రి మట్లాడుతూ బెస్ట్ ఇన్ ట్రావెల్–2025 జాబితాలో పుదుచ్చేరి ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని సంపాదించుకుందని అన్నారు . ప్రపంచంలో సందర్శన ప్రాంతాల్లో పుదుచ్చేరి రెండో స్థానంలో నిలిచిందన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం పర్యాటక రంగాన్ని వినూత్నంగా అభివృద్ధి పరుస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈక్రమంలో ఎక్స్పీరియన్స్ పాండిచ్చేరి–లోన్లీ ప్లానెట్స్ పిక్ ట్రావెల్ ప్యాకేజీని తీసుకునిరాగా రాడిసన్ రిసార్ట్ పాండిచ్చేరి బే ఒక కొత్త అనుభవపూర్వక ఆఫర్ను ప్రవేశపెట్టినట్ట విక్రమ్ కోటా తెలియజేశారు.
పైపులైన్ల మరమ్మతులు త్వరితగతిన పూర్తి చేయండి
–కలెక్టర్ సుబ్బలక్ష్మి ఆదేశం
వేలూరు: వేలూరు కార్పొరేషన్కు సరఫరా అయ్యే తాగునీటి పైపులైన్లకు మరమ్మతులు వెంటనే పూర్తి చేసి నీరు సరఫరా చేయాలని కలెక్టర్ సుబ్బలక్ష్మి అధికారులను ఆదేశించారు. వేలూరు కార్పొరేషన్ పరిధిలోని చేపల మార్కెట్ సమీపంలో తాగునీటి పైపులైను మరమ్మతు పనులులచేస్తున్నారు. దీంతో రెండు రోజులుగా కార్పొరేషన్కు నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కలెక్టర్ ఉదయం నేరుగా వెళ్లి పరిశీలించారు. ప్రస్తుతం పనులు చేస్తున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్యతో పాటు తాగునీటి సమస్య కూడా తలెత్తుతోందని, వేసవిలో తాగునీటిని రోజూ సరఫరా చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని, ఎక్కడా పైపులైన్ల లీకేజీలు లేకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో కలెక్టర్తో పాటు కార్పొరేషన్ కమిషనర్ జానకి, కార్పొరేషన్ అధికారులు, తమిళనాడు నీటి సరఫరా శాఖ ఇంజినీర్లు, అధికారులు పాల్గొన్నారు.
పోప్ ఫ్రాన్సిస్కు అంజలి
రోమన్ క్యాథలిక్ గురువైన పోప్ ప్రాన్సిస్ అస్తమించిన విషయం తెలిసిందే. ఆయన్ని స్మరిస్తూ చైన్నెలోని లయోలా కళాశాలలో సంస్మరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం జరిగింది. పోప్ చిత్ర పటానికి సీఎం స్టాలిన్ అంజలి ఘటించారు. పోప్ సేవలను గుర్తు చేస్తూ, ఆయన పార్తీవ దేహానికి తమిళనాడు ప్రభుత్వం తరపున బృందం వాటికన్కు వెళ్లి నివాళులర్పించిన విషయాన్ని సీఎం ప్రస్తావించారు. శాంతికి చిహ్నంగాపోప్ కీర్తి అజరామరం అని పేర్కొన్నారు.
– సాక్షి, చైన్నె
కోవై బ్యాంక్కు బాంబు బెదిరింపు
తిరువొత్తియూరు: కోవై సింగం ప్రాంతంలో సౌత్ ఇండియన్ బ్యాంక్కు బాంబు బెదిరింపు రావడం సంచలనం కలిగించింది. ఈ బ్యాంకుకు బుధవారం ఈ మెయిల్ ద్వారా బాంబు పెట్టి ఉన్నట్లు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దిగ్భ్రాంతి చెందిన బ్యాంకు శాఖ మేనేజరు రేస్ కోర్సు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో బాంబు స్క్వాడ్ నిపుణులు, పోలీసులు జాగిలాలతో అక్కడ చేరుకొని డిటెక్టర్ ద్వారా బ్యాంక్ ప్రాంతం అంతా తనిఖీ చేశారు. చివరికి బాంబు ఏదీ లేదని తేల్చారు. ఈమేరకు పోలీసులు విచారణ చేస్తున్నారు.
అపోలోలో డిజి–స్టార్ట్ ల్యాబ్
కొరుక్కుపేట: అపోలో డయాగ్నోస్టిక్స్ చైన్నెలో డిజి–స్మార్ట్ సెంట్రల్ రెఫరెన్స్ ల్యాబొరేటరీ(సీఆర్ఎల్)ను అందుబాటులోకి తీసుకొచ్చారు. బుధవారం ఉదయం జరిగిన కార్యక్రమానికి అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంచనంగా ప్రారంభించారు. ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్పర్సన్ డాక్టర్ ప్రీతారెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతరెడ్డి పాల్గొన్నారు.
అల్లుడికి యావజ్జీవ శిక్ష
అన్నానగర్: అత్తను కడతేర్చిన కేసులో అల్లుడికి కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. చైన్నెలోని మాధవరం డెయిరీ ప్రాంతానికి చెందిన బాలాజీ (26). ఇతని భార్య సుధ. వీరిద్దరు 2015లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. భార్య ప్రవర్తనపై బాలాజీకి అనుమానంతో తరచూ ఆమెతో గొడవ పడేవాడు. 2021లో దంపతుల మధ్య వివాదం తలెత్తడంతో బాలాజీ ఆమైపె దాడి చేశాడు. దీంతో సుధ పుట్టింటికి వెళ్లింది. విషయం తెలిసి బాలాజీ డిసెంబర్ 18, 2021న అక్కడికి వెళ్లి గొడవకు దిగాడు. ఆపై బాలాజీ కత్తితో సుధ తల్లి లతను హత్య చేశాడు. ఎంకేబీ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి బాలాజీని అరెస్ట్ చేశారు. జస్టిస్ మురుగేశన్ ఎదుట చైన్నెలోని 6వ అదనపు సెషన్న్స్ కోర్టులో విచారణ జరిగింది. పోలీసుల తరఫున అదనపు క్రిమినల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవాప్రసాద్ హాజరయ్యారు. బుధవారం కేసును విచారించిన న్యాయస్థానం బాలాజీపై అభియోగం రుజువు కావడంతో జీవిత ఖైదు, రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
తిరువళ్లూరు: జిల్లాలోని అర్హులైన వారిని గుర్తించి ఒకేసారి 65వేల మందికి ఇంటి పట్టాలను పంపిణీ చేశామని, అందుకు రెవెన్యూతో సహా అన్ని శాఖలకు చెందిన అధికారులు మూడు నెలల పాటు నిరంతరాయంగా శ్రమించారని మంత్రి నాజర్ అన్నారు. తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ పొన్నేరిలోని అండార్మఠంలో ఇటీవల సీఎం సుమారు రెండు లక్షల మందికి వేర్వేరు సంక్షేమ పథకాల ఫలాలు అందజేయడం విదితమే. జిల్లాలోని దాదాపు 65 వేల మందికి రికార్డు స్థాయిలో ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సభ, సంక్షేమ పథకాలను పంపిణీ చేయడానికి శ్రమించిన ఉద్యోగులను బుధవారం ఉదయం కలెక్టర్ కార్యాలయంలో సన్మానించారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర మైనారిటీ సంక్షేమశాఖ మంత్రి నాజర్తో పాటు పలువురు హాజరయ్యారు. మంత్రి పై విధంగా మాట్లాడారు. సంక్షేమ పథకాల కోసం అర్హుల ఎంపిక విషయంలో అధికారులు నిరంతరాయంగా కృషి చేశారని అభినందించారు. అనంతరం తహసీల్దార్లు, ఆర్డీఓలు, అన్ని శాఖ అధికారులను మంత్రి, కలెక్టర్ ప్రతాప్ సన్మానించి ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్వో రాజ్కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ జయకుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
సేలం: నాగర్కోయిల్–బెంగళూరు ఎక్స్ప్రెస్ (నంబర్. 17236) మదురై, కరూర్, నామక్కల్, సేలం మీదుగా బెంగళూరుకు నడుస్తోంది. అదేవిధంగా ఈ రైలు బెంగళూరు నుంచి సేలం మీదుగా నాగర్కోయిల్కు నడుస్తోంది. ఈ స్థితిలో ఎప్పటిలాగే ఈ రైలు మంగళవారం రాత్రి 7.15 గంటలకు నాగర్కోయిల్ జంక్షన్ రైల్వేస్టేషన్న్లో బయలుదేరి బెంగళూరు వెళుతోంది. జనరల్ కోచ్లో ప్రయాణిస్తున్న వీరమణి (29) వద్ద మదురై రైల్వే స్టేషన్లో రైలు ఆగినప్పుడు, గుర్తుతెలియని వ్యక్తి 8 నెలల బాలుడిని అప్పగించి వాటర్ బాటిల్ కొనుక్కుని వస్తానని చెప్పి వెళ్లాడు. అప్పటికి రైలు బయలుదేరింది. అతను రాకపోవడంతో వీరమణి హెల్ప్లైన్న్కు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాడు. దీని ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో రైలు సేలం జంక్షన్ రైల్వేస్టేషన్న్కు రాగానే ఎస్ఐ కోదండపాణి, మహిళా పోలీసు అధికారిణి రమ్య వీరమణి నుంచి చిన్నారిని తీసుకుని పోలీస్స్టేషన్కు తీసుకొచ్చారు. అనంతరం చిన్నారిని సేలం జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్న శిశు సంక్షేమ క్షేత్రస్థాయి కార్యకర్తకు అప్పగించారు.

పర్యాటకులకు స్వర్గధామం పుదుచ్చేరి

పర్యాటకులకు స్వర్గధామం పుదుచ్చేరి

పర్యాటకులకు స్వర్గధామం పుదుచ్చేరి

పర్యాటకులకు స్వర్గధామం పుదుచ్చేరి