●తుంగభద్ర తుళ్లింత | - | Sakshi
Sakshi News home page

●తుంగభద్ర తుళ్లింత

Jul 4 2025 7:11 AM | Updated on Jul 4 2025 7:11 AM

●తుంగభద్ర తుళ్లింత

●తుంగభద్ర తుళ్లింత

బొమ్మనహాళ్‌: ఎగువన కురుస్తున్న వర్షాలతో భారీగా వరద వచ్చి చేరుతుండటంతో గురువారం తుంగభద్ర జలాశయం 20 క్రస్ట్‌ గేట్లను బోర్డు అధికారులు ఎత్తివేశారు. రెండున్నర అడుగుల మేర ఎత్తి నదికి 58,260 క్యూసెక్కులు, వివిధ కాలువలకు 4,506 క్యూసెక్కులు కలిపి మొత్తం 62,766 క్యూసెక్కులను బయటికి పంపుతున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా ప్రస్తుతం 80 టీఎంసీలకు కుదించారు. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోపే ఆమేరకు నీరు చేరడం గమనార్హం. దీంతో డ్యాంలో 78.100 టీఎంసీలు నిల్వ ఉంచి మిగిలిన నీటిని నదికి వదులుతున్నారు.

20 క్రస్ట్‌ గేట్లు ఎత్తివేత

58,260 క్యూసెక్కుల నీరు నదికి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement