
క్షుద్రపూజల కలకలం
బల్లికురవ: మూడు రోడ్ల కూడలిలో అర్ధరాత్రి క్షుద్రపూజలు చేయడంతో ప్రజలు, వాహనదారులు భయాందోళన చెందుతున్నారు. బల్లికురవ–అద్దంకి ఆర్అండ్బీ రోడ్లోని కొమ్మినేనివారిపాలెం, వలపర్ల వెళ్లే క్రాస్ రోడ్డు జంక్షన్లో సోమవారం అర్ధరాత్రి ఆగంతకులు గుమ్మడికాయలు, కుంకుమ, పసుపు పూలతో పూజలు నిర్వహించారు. మంగళవారం ఆ మార్గంలో వెళ్తున్న వారంత ఇవి దాటి వెళ్లాలంటే ఏ ప్రమాదం ముంచుకువస్తోనని భయాందోళన చెందారు. ప్రతి నిత్యం ఏదో ఒక ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఇలాంటి క్షుద్ర పూజలు చేస్తున్నారని వాటిని అరికట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
18 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
తాడికొండ: అక్రమంగా నిల్వ చేసిన 18 బస్తాల రేషన్ బియ్యాన్ని సివిల్ సప్లైస్ అధికారులు పట్టుకున్న ఘటన మండల కేంద్రమైన తాడికొండలో జరిగింది. వివరాల ప్రకారం తాడికొండ చెరువు కట్టపై రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు వచ్చిన సమాచారం మేరకు సీఎస్ డీటీ దేవరాజు, ఆర్ఐ హనుమంతరావుల ఆధ్వర్యంలో మంగళవారం దాడులు నిర్వహించగా 35 కిలోల తూకం కలిగిన 18 బస్తాల రేషన్ బియ్యం పట్టుబడింది. దీనిపై విచారించగా తాడికొండకు చెందిన గుర్రపుశాల ఆనంద్ అనే వ్యక్తి కొనుగోలు చేసి నిల్వ చేసినట్లు స్థానికులు తెలపగా అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.