‘నాన్‌ మస్టర్‌’ కార్మికుల వేతనాల పెంపు | - | Sakshi
Sakshi News home page

‘నాన్‌ మస్టర్‌’ కార్మికుల వేతనాల పెంపు

Jul 3 2025 5:28 AM | Updated on Jul 3 2025 5:28 AM

‘నాన్‌ మస్టర్‌’ కార్మికుల వేతనాల పెంపు

‘నాన్‌ మస్టర్‌’ కార్మికుల వేతనాల పెంపు

నరసరావుపేట: 2025–26 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో నాన్‌ మస్టర్‌రోల్‌ విధానంలో పనిచేసే కార్మికుల వేతనాల పెంపుదలకు జిల్లా కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు ఆమోదం తెలిపారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో జిల్లాస్థాయి నాన్‌ మస్టర్‌రోల్‌ వేతనాల స్థిరీకరణ సమావేశం బుధవారం నిర్వహించారు. అత్యంత నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనం రోజుకు రూ.864 నుంచి రూ.899కి పెంచారు. నైపుణ్యం కలిగిన కార్మికుల వేతనం రూ.855, పాక్షిక నైపుణ్య కార్మికుల వేతనం రూ.742, నైపుణ్యంలేని కార్మికుల వేతనం రూ.619గా నిర్థారించారు. జిల్లాలోని ప్రభుత్వ శాఖలు తాత్కాలిక అవసరాల కోసం రోజువారీ ప్రాతిపదికన పనిచేసే నాన్‌ మస్టర్‌రోల్‌ కార్మికులకు నూతనంగా నిర్ధారించిన వేతనాలు చెల్లించాలని ఆదేశించారు. కార్మిక శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసరావు, సీపీఓ జి.శ్రీనివాస్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ రాజానాయక్‌, డీఈఓ చంద్రకళ, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎస్‌ఈ కృష్ణమోహన్‌ పాల్గొన్నారు.

ఆమోదం తెలిపిన జిల్లా కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement