న్యూయార్క్‌లో బాపూజీ విగ్రహం ధ్వంసం | Mahatma Gandhi statue in New York City Vandalised | Sakshi
Sakshi News home page

న్యూయార్క్‌లో బాపూజీ విగ్రహం ధ్వంసం.. ఎన్నారైల ఆగ్రహం

Feb 12 2022 12:41 PM | Updated on Feb 12 2022 1:17 PM

Mahatma Gandhi statue in New York City Vandalised - Sakshi

జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి అమెరికాలో అవమానం జరిగింది. న్యూయార్క్‌ నగరంలో మాన్‌హట్టన్‌ సమీపంలోని యూనియన్‌ స్క్వేర్‌లో ఉన్న గాంధీజీ నిలువెత్తు విగ్రహాన్ని 2022  ఫిబ్రవరి 4 రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. 1980వ దశకంలో న్యూయార్క్‌ నగరంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దేశం వెలుపల గాంధీజీ విగ్రహాలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి కావడం గమనార్హం.

గాంధీజీ విగ్రహం ధ్వంసం చేయడం పట్ల గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ పీపుల్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఆరిజిన్‌ (గోపియో) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దారుణానికి పాల్పడిన దుండగులను కఠినంగా శిక్షించాలని గోపియో అధ్యక్షుడు శివేందర్‌ సోఫాట్‌ డిమాండ్‌ చేశారు. ఈ తప్పుడు పనికి పాల్పడిన వారిని త్వరగా గుర్తించాలంటూ ‍న్యూయార్క్‌ మేయర్‌ని డిమాండ్‌ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement