ఉత్తరప్రదేశ్ వాసిని పెళ్లాడిన స్వీడిష్ యువతి
ప్రేమకు హద్దులు లేవని ఇక్కడొక జంట నిరూపించారు. ఇంతవరకు మన భారతీయులు విదేశీయులను పెళ్లాడిన ఎన్నో ఉదంతాలను చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్లోని ఎటాహ్లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..డెహ్రుడూన్లో బీటెక్ పూర్తి చేసిన పవన్ కుమార్ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. అతనికి స్వీడిష్ యువతి క్రిస్టెన్ లీబర్ట్ 2012లో ఫేస్బుక్ ద్వారా పరిచయమైంది. ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారీ అతని కోసం దేశం విడిచి వచ్చేంత వరకు వచ్చింది.
ఈ మేరకు ఆమె అతడిని పెళ్లి చేసుకునేందుకు పవన్కుమార్ స్వస్థలం ఉత్తరప్రదేశ్లోని ఎటాహ్కి వచ్చింది. అక్కడ ఒక పాఠశాలలో ఆ జంట ఘనంగా వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి పవన్ కుమార్ తల్లిదండ్రులు అంగీకరించడం విశేషం. ఫేస్బుక్ ద్వారా పరిచయమైన ఇరువురు పెళ్లితో ఒక్కటయ్యారు. ఐతే తమకు పిల్లల ఆనందంలోనే తమ సంతోషం దాగి ఉందని ఆనందంగా చెబుతున్నారు వరుడి తండ్రి గీతా సింగ్. ఈ పెళ్లికి తాము మనస్పూర్తిగా అంగీకరిచినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
Swedish woman flies to India to marry longtime boyfriend from Uttar Pradesh.
Read: https://t.co/GnxZODg05d pic.twitter.com/KJ2whmaC2k
— editorji (@editorji) January 29, 2023
(చదవండి: అక్కడ ఉల్లి మహా ఘాటు..ధర వింటే కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి)
సంబంధిత వార్తలు