స్వతంత్ర భారతి 1977/2022 | Azadi Ka Amrit Mahotsav: Swatantra Bharati 1977 To 2022 | Sakshi
Sakshi News home page

స్వతంత్ర భారతి 1977/2022

Jul 1 2022 11:26 AM | Updated on Jul 1 2022 11:46 AM

Azadi Ka Amrit Mahotsav: Swatantra Bharati 1977 To 2022 - Sakshi

ప్రధానిగా మొరార్జీ
1977 మార్చిలో జరిగిన ఎన్నికల్లో భారతీయ ఓటర్లు 21 నెలల పాటు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించిన ఇందిరా గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీని నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. ఇప్పటి ప్రజా తీర్పు దేశంలో వివిధ రంగాలలో అనేక రకాలుగా నవ్యత్వానికి నాంది పలికింది. అది ఢిల్లీలో మొట్టమొదటి కాంగ్రెసేతర (జనతా పార్టీ), మొట్ట మొదటి సంకీర్ణ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చింది. కాంగ్రెస్‌ అజేయమనే భావనకు 1977లో ప్రజాతీర్పు గండి కొట్టింది. ఫలితంగా వివిధ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ను ఓడించి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రాగలిగాయి. 

1977 నాటి రాజకీయ వారసత్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రాలలోను, కేంద్రంలోనూ అధికారంలో ఉన్న అనేక పార్టీల మూలాలు జనతా పార్టీలోనే ఉన్నాయి. బి.జె.పి కూడా జనతా పార్టీలో తన జన సంఘ్‌ అవతారంలో ఒక భాగంగా ఉంది. నేడున్న వివిధ ప్రాంతీయ పార్టీలకు మాతృసంస్థ అయిన భారతీయ కిసాన్‌ దళ్‌ కూడా జనతా పార్టీలో భాగమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement