చిత్తడి నేలల జాబితా సిద్ధం చేయాలి
నారాయణపేట: జిల్లాలో చిత్తడి నేలల జాబితాను సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ చిత్తడి నేలల (సంరక్షణ, నిర్వహణ) నియమాలు, సర్వే, సరిహద్దులు, 2017 ప్రకారం తడి భూముల నోటిఫికేషన్పై జిల్లా కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీకి చైర్మన్గా అధ్యక్షత వహించిన కలెక్టర్ మాట్లాడుతూ.. నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుంచి 3 నెలల్లోపు జిల్లాలోని అన్ని చిత్తడి నేలల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ నిబంధనల ప్రకారం నియంత్రణ, వాటి సంక్షిప్త పత్రాల ఆధారంగా గుర్తించబడిన చిత్తడి నేలలను సిఫార్సు చేయాలన్నారు. ఏడాది లోపు అన్ని చిత్తడి నేలల సమగ్ర డిజిటల్ జాబితా రూపొందించాలని సూచించారు. అలాగే నోటిఫైడ్ చిత్తడి నేలలు వాటి ప్రభావ జోన్లలో నియంత్రించాల్సిన, అనుమతించాల్సిన కార్యకలాపాల సమగ్ర జాబితాను అభివృద్ధి చేయాలని చెప్పారు. నిషేధిత కార్యకలాపాల జాబితాకు ఏవైనా చేర్పులు ఉంటే సిఫార్సు చేయాలన్నారు. నోటిఫై చేయబడిన ప్రతి తడి భూములకు సమగ్ర నిర్వహణ ప్రణాళికను సమీక్షించాల్సి ఉంటుందన్నారు. ఈ కమిటీలో చైర్మన్గా కలెక్టర్, కన్వీనర్ సభ్యుడిగా జిల్లా అటవీ శాఖ అధికారితో పాటు స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్లతో కూడిన ఏడుగురు సంబంధిత శాఖల అధికారులు ఉంటారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీను, జిల్లా అటవీ శాఖ అధికారి ప్రసాద్రెడ్డి, డీఏఓ జాన్ సుధాకర్, జిల్లా మత్స్యశాఖ అధికారి రహ్మాన్, డీపీఓ సుధాకర్రెడ్డి, నీటి పారుదల శాఖ అధికారి బ్రహ్మనందరెడ్డి పాల్గొన్నారు.


