
యూఎల్బీల ఎంపికలో ప్రభుత్వం వివక్ష
డోన్: యూఎల్బీలను(అర్బన్ లోకల్ బాడీ) బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని 25 మున్సిపాల్టీలను ఎంపిక చేసింది. ఎంపిక చేసిన కార్పొరేషన్, మున్సిపాలిటీ, నగర పంచాయతీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులైన మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, చైర్ పర్సన్లను స్థానిక సంస్థల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన పాలన, ఆర్థికంగా బలోపేతం చేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఈ నెల 3, 4 తేదీల్లో హర్యానా రాష్ట్రంలోని గుర్గ్రామ్లో రెండు రోజులపాటు జాతీ య స్థాయి సదస్సు నిర్వహిస్తోంది. స్థానిక సంస్థల బలోపేతం దిశగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పాల్గొనేందుకు ప్రభుత్వం ఇప్పటికే 643 జీవో జారీ చేసింది. రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలకు చోటు కల్పించి ఉమ్మడి జిల్లాలను పూర్తిగా విస్మరించడంపై డోన్ మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర మున్సిపల్ మంత్రి నారాయణకు లేఖ రాశారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నా రు. స్థానిక సంస్థల అభివృద్ధికి వైఎస్సార్సీపీ ఎంతో కృషి చేస్తుందన్నారు.కేవలం రాజకీయం కోణంలో ఈ ప్రభుత్వం యుఎల్బీలను ఎంపిక చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు చేయకుండా స్థానిక సంస్థల అభివృద్ధికి ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇంతటి వివక్ష చూపడం మూలంగా స్థానిక సంస్థలు ఎలా బలోపేతమవుతాయని ఆయన మంత్రి నారాయణను లేఖలో నిలదీశారు.
ఉమ్మడి కర్నూలు జిల్లాలో
ఒక్క మున్సిపాలిటీకీ దక్కని అవకాశం
మున్సిపల్ శాఖ మంత్రికి లేఖ రాసిన
డోన్ మున్సిపల్ చైర్మన్