
కేఎంసీకి మూడో స్థానం
25 శాతం ఫీజు రాయితీతో ఎల్ఆర్ఎస్ పన్ను చెల్లింపుల్లో ఖమ్మం కార్పొరేషన్ రాష్ట్రంలో మూడో స్థానాన నిలిచింది. మొదటి స్థానంలో గ్రేటర్ వరంగల్, రెండో స్థానంలో పెద్ద అంబర్పేట ఉన్నాయి. కేఎంసీ పరిధిలో 40,181 దరఖాస్తులు రాగా.. 29,322 మందికి ఫీజు చెల్లించాలని సమాచారం ఇచ్చారు. ఇందులో 11,999 మంది ఫీజు చెల్లించగా, కేఎంసీకి రూ.54.58 కోట్ల ఆదాయం సమకూరింది. జిల్లాలో వచ్చిన ఆదాయం సగానికి పైగా కేఎంసీ నుంచే నమోదు కావడం విశేషం. రాయితీ సమాచారం యాజమానులకు చేరవేయడం, గడువులోగా ఫీజు చెల్లించేలా అధికారులు పర్యవేక్షించడంతో ఫలితం దక్కిందని భావిస్తున్నారు. ఇక సుడా పరిధిలో 19,245 మందికి సమాచారం ఇవ్వగా, 5,825 మంది రూ.15.38 కోట్ల మేర చెల్లించారు.