
రాఘవుడి సన్నిధిలో మాజీ సీఎం కుటుంబం
రాయచూరు రూరల్: మంత్రాలయ మఠంలో శ్రీగురు రాఘవేంద్ర స్వాముల దర్శనం కోసం మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప కుటుంబ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం మంత్రాలయ మఠం ప్రాంగణంలో స్వామివారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతో దైవదర్శనం చేసుకున్నారు. పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రిని పూర్ణకుంభ కలశాలతో స్వాగతించి వారిని ఘనంగా సన్మానించారు. ఎంపీ రాఘవేంద్ర, శాసన సభ్యుడు విజయేంద్ర పాల్గొన్నారు.
వ్యక్తి దారుణ హత్య
రాయచూరు రూరల్: నగరంలోని రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తులు వీరేష్(35) అనే వ్యక్తిని హత్య చేశారు. ఇందిరా నగర్లో నివాసముంటున్న వీరేష్ను మంగళవారం రాత్రి రైల్వేస్టేషన్ ప్రాంగణంలో పదునైన ఆయుధంతో కొట్టి చంపినట్లు పశ్చిమ స్టేషన్ పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ శాంతవీర తెలిపారు.

రాఘవుడి సన్నిధిలో మాజీ సీఎం కుటుంబం