
ఈదురు గాలులకు కరెంటు కష్టాలు
తుమకూరు: తుమకూరు జిల్లాలో సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షం, ఈదురు గాలులకు విధ్వంసం చోటుచేసుకుంది. అనేకచోట్ల కరెంటు స్తంభాలు నేలకూలడంతో ప్రజలు చీకట్లో విలవిలలాడారు. చిక్కనాయకనహళ్ళి, శిర, మధుగిరి, తుమకూరు, గుబ్బి, తిపటూరు తాలూకాలలో పోల్స్ పడిపోయి కరెంటు నిలిచిపోయింది. చాలాచోట్ల పిడుగులు పడ్డాయి. దాని వల్ల ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిని లింగప్పనపాళ్య, కారెహళ్ళి, కంకెరె ప్రాంతాల్లో కరెంటు నిలిచిపోయింది. పలు పంచాయతీలలో 50 దాకా కరెంటు స్తంభాలు పడిపోయాయి. రాత్రి కావడంతో బెస్కాం సిబ్బంది కదలలేదు. మంగళవారం ఉదయం నుంచి పనులు చేపట్టగా మధ్యాహ్నానికి సరిచేశారు.
తుమకూరు జిల్లాలో కూలిన స్తంభాలు

ఈదురు గాలులకు కరెంటు కష్టాలు